సీసము
భరతకులాగ్రణి పాండవసింహంబు
సర్వధర్మజ్ఞుఁ డాసవ్యసాచి
దనమేనమఱఁదలి ధవళాక్షిఁ దోడ్కొని
చనియె నాతని కది చనదె చెపుఁడ
యప్పార్థుపిఱుఁద మీ రరుగంగ వాఁ డంత
యశ్రమసాధ్యుఁడె యాహవమున
నఖిలాస్త్రవిదుఁడు ద్రోణాచార్యశిష్యుండు
జితకాశి యని వానిఁ జెప్ప వినరె
ఆటవెలది
వలవ దుడుగుఁ డనిన వామను పలుకను
వేలఁ గడవదయ్యె వృష్ణిభోజ
యాదవాంబురాశి యట ధనుంజయుఁ డవి
జేయుఁ డభిమతార్థసిద్ధిఁ బొంది.
(అర్జునుడు తన మేనమరదలిని తీసుకువెళ్లటం తగదా? అతడిని యుద్ధంలో ఓడించటం అంత సులభమా? - అనగా కృష్ణుడి మాటలు అనే చెలియలికట్టను యాదవులనే సముద్రం దాటలేకపోయింది. అర్జునుడు తాను కోరినదానిని పొందాడు.)
No comments:
Post a Comment