వచనము
మన మివ్విధంబునఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్త్రి యప్రియంబులు వలుకునో యప్పరమ పతివ్రతపలుకు నిక్కువం బగుం గావున నీవేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గను మని పనిచిన సుభద్రయు నిజేశ్వరుపంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన.
(మనం కలిసి వెడితే ద్రౌపది పరుషంగా మాట్లాడుతుందేమో. కాబట్టి నీవు ముందుగా వెళ్లి ఆమెను చూడు - అనగా సుభద్ర అలాగే ఇంద్రప్రస్థపురానికి వెళ్లి కుంతీదేవికి, ద్రౌపదికి మొక్కగా.)
No comments:
Post a Comment