వచనము
జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ దొల్లి శ్వేతకి యనురాజర్షి ఘృతసంపూర్ణదక్షిణానేకాధ్వరుం డయి శతవార్షికసత్త్రయాగంబు సేయ సమకట్టి ఋత్విజులం బ్రార్థించిన ఋత్విజులు నేము నిరంతర క్లేశంబున కోపము నీవనవరతయజనశీలుండవు నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయనోపుంగాని యొరు లోప రని విసివి పలికిన నాతండును గైలాసంబున కరిగి కైలాసవాసు నిఖిలలోకవంద్యునిందుశేఖరునీశ్వరు నుద్దేశించి యుగ్రతపంబు సేసినఁ బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె.
(అప్పుడు జనమేజయుడికి వైశంపాయనుడు ఇలా చెప్పాడు - పూర్వం ఎన్నో యజ్ఞాలు చేసిన శ్వేతకి అనే రాజర్షి సత్రయాగం చేయబోగా - మేము ఎడతెగని శ్రమకు ఓర్వలేము. నీ యజ్ఞానికి ఋత్విక్కుగా ఈశ్వరుడే ఉండగలడు - అనగా శ్వేతకి కైలాసానికి వెళ్లాడు. అక్కడ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment