వచనము
దేవా నీప్రసాదంబున శతవార్షికసత్త్రయాగంబు చేసెద నాకు నీవు ఋత్విజుండవు గావలయు నని ప్రార్థించినం గరుణించి యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టం బగుటంజేసి దాని నొరులకుఁ జేయంగాదు గావున నింక నీవు బ్రహ్మచర్యంబునఁ బండ్రెండేండ్లు నిరంతరఘృతధారంజేసి హుతాశనుఁ దృప్తుం జేయు మనిన వాఁడును బరమేశ్వరుపంచిన విధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్టుం డై యీశ్వరుండు వాని పాలికి వచ్చి యప్పుడ దుర్వాసు రావించి.
(దేవా! నా సత్రయాగానికి నీవు ఋత్విజుడివి కావాలి - అని ప్రార్థించగా - బ్రాహ్మణులు కాక ఇతరులు యాజకత్వం వహించకూడదు. నీవు బ్రహ్మచర్యవ్రతం పూని పన్నెండేళ్లు ఎడతెగని నేతిధారతో అగ్నిదేవుడిని తృప్తిపెట్టు - అనగా శ్వేతకి అలాగే చేశాడు. అప్పుడు శివుడు దుర్వాసుడిని రప్పించి.)
No comments:
Post a Comment