వచనము
శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతం బయిన సత్త్రయాగంబు సేసె న ట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు నైనఁ బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పినఁ బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కి ట్లనియె.
(ఆ యజ్ఞంలోని నేతి కారణంగా అగ్నిదేవుడికి జీర్ణశక్తి తగ్గి, కాంతి సన్నగిల్లి, దప్పిక ఎక్కువై బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లగా, అది నేతిని అపరిమితంగా ఉపయోగించటం వల్ల కలిగిన వ్యాధిగా గ్రహించి ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment