వచనము
అని తత్ప్రభావప్రకారంబు చెప్పినఁ గృష్ణార్జునులు సంతసిల్లి సన్నద్ధు లయి రథం బెక్కి యగ్నిదేవుం జూచి సురాసురపరివృతుం డయి సురపతి వచ్చినను జయింతు మింక శంకింపక ఖాండవదహనార్థం బుపక్రమింపు మనిన నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి.
(అప్పుడు కృష్ణార్జునులు రథం ఎక్కి అగ్నిదేవుడితో - ఇంద్రుడు దేవదానవులతో కలిసివచ్చినా జయిస్తాము. సంకోచించకుండా ఖాండవవనాన్ని దహించటం ప్రారంభించు - అనగా అగ్నిదేవుడు సంతోషించి.)
No comments:
Post a Comment