గద్యము
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున విదురాగమనంబు గృష్ణసందర్శనంబును రాజ్యార్థలాభంబును ఖాండవప్రస్థనివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయు నర్జునుతీర్థాభిగమనంబును నులూచీసమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహనజన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతుం డయి యర్జునుండు సుభద్ర వివాహం బగుటయు సుభద్రాపహరణంబును హరణహారికయు నభిమన్యుసంభవంబును గాండీవదివ్యరథాశ్వలాభంబును ఖాండవదహనంబును నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును మందపాలోపాఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము.
శ్రీ మహాభారతము నందలి యాదిపర్వము సమాప్తము.
(ఇది నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలోని ఆదిపర్వంలో - విదురుడి రాక, కృష్ణుడు పాండవులను దర్శించటం, అర్ధరాజ్యం పాండవులకు లభించటం, ఖాండవప్రస్థంలో పాండవులు నివసించటం, సుందోపసుందుల ఉపాఖ్యానం, నారదుడి మాటలు విని పాండవులు ద్రౌపది విషయంలో నియమాన్ని పాటించటం, అర్జునుడి తీర్థయాత్రలు, ఉలూచి సమాగమం, చిత్రాంగదకు బభ్రువాహనుడు జన్మించటం, అర్జునుడు ద్వారకకు వెళ్లటం, సుభద్ర వివాహం, సుభద్రను తనతో తీసుకువెళ్లటం, సుభద్రకు యాదవులు అరణాలు అందించటం, అభిమన్యుడు జన్మించటం, గాండీవదివ్యరథాశ్వాలు అర్జునుడికి లభించటం, ఖాండవదహనం, మయుడిని రక్షించటం, మందపాలోపాఖ్యానం - మొత్తం ఎనిమిదవ ఆశ్వాసం.
ఆదిపర్వంలో అష్టమాశ్వాసం సమాప్తం.
శ్రీమహాభారతంలో ఆదిపర్వం సమాప్తం.)
No comments:
Post a Comment