వచనము
తొల్లి వృషపర్వుండను దానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధ రత్నమయంబులయిన యుపకరణంబు లొడఁగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాఁడ నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద మఱియును భౌమాదిత్యుండను రాజర్షిచేత నిహితంబయి సకలశత్రుఘాతినియైనదాని భీమసేనున కొక్కగదను దారుణం బయిన దివ్యఘోషంబు గలుగు దేవదత్తంబను శంఖం బర్జునునకు నిచ్చెదనని చెప్పి ధర్మరాజుచేత సత్కృతుండై మయుం డరిగె నంత నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలాలసుండై ద్వారవతీపురంబున కరిగె నట మయుండును బూర్వోత్తరదిశాభిముఖుండై పోయి కైలాసంబునుత్తరంబున మైనాకశైలంబునందు హిరణ్యశృంగంబున.
(బిందుసరం అనే కొలనులో ఉంచిన సామగ్రితో ధర్మరాజుకు సభ నిర్మిస్తాను. శత్రువులను హతమార్చే గదను భీముడికి, దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడికి ఇస్తాను - అని చెప్పి మయుడు బయలుదేరాడు. కృష్ణుడు కూడా తన తండ్రిని చూడటానికి ద్వారవతికి వెళ్లాడు. మయుడు ఈశాన్యదిశలో వెళ్లి కైలాసపర్వతానికి ఉత్తరాన మైనాకపర్వతం మీది హిరణ్యశిఖరాన్ని చేరుకున్నాడు.)
No comments:
Post a Comment