అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థమలచ్ఛాయమై
సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజా
తమహాభారతపారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్యమై.

(కథలనే కొమ్మలతో, వేదార్థమనే నీడతో, ధర్మార్థకామమోక్షాలనే పూలతో, కృష్ణార్జునుల సద్గుణాలను ప్రశంసించటం వలన కలిగే మేలు అనే పండ్లతో వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన భారతం అనే కల్పవృక్షం ప్రార్థింపదగినది.)
No comments:
Post a Comment