త్రేతాద్వాపరసంధి నుద్ధతమదాంధీభూతవిద్వేషి జీ
మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్ ముయ్యేడుమాఱుల్ రణ
ప్రీతిన్ వైరిధరాతలేశ్వరులఁ జంపెం బల్వురన్ దీర్ఘని
ర్ఘాతక్రూరకుఠారలూననిఖిలక్షత్త్రోరుకాంతారుఁడై.

(త్రేతాద్వాపర యుగాల సంధికాలంలో, గర్వించిన శత్రువులనే మేఘాలకు వాయువైన పరశురాముడు ఇరవైయొక్కసార్లు వజ్రంలా కఠినమైన గొడ్డలితో సర్వక్షత్రియులనే గొప్ప అడవిని ఖండించినట్లు రణప్రీతితో శత్రురాజులను సంహరించాడు.)
No comments:
Post a Comment