వచనము
ఏను మదీయమాతృదాసీత్వనిరాసార్థం బురగుల కమృతంబు దెచ్చి యిత్తునని కాద్రవేయులతో నొడివి వచ్చినవాఁడ నీయమృతంబు గొనిపోయి వారల కిచ్చి మదీయజననీదాస్యంబుఁ బాచికొనిన నురగు లీ యమృతం బుపయోగింపకుండ ముందఱ నీవు గొని చను మనిన నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి నీ బలపరాక్రమంబులు వినవలతుం జెప్పు మనిన నయ్యింద్రునకు గరుడం డిట్లనియె.
("నా తల్లి దాస్యం పోగొట్టడానికి నాగులకు ఈ అమృతం తెచ్చి ఇస్తానని చెప్పాను. ఇది నేను వారికిచ్చిన తaరువాత వారు దాన్ని తాగకముందే నువ్వు తిరిగి తీసుకో". ఇంద్రుడు గరుత్మంతుడిని మెచ్చుకొని, "నీ బలపరాక్రమాలు వినాలని ఉంది", అనగా గరుడుడు ఇలా చెప్పాడు.)
No comments:
Post a Comment