వచనము
ఇట్లురగు లమృతం బుపయోగింపం గానక చనిన శేషుండు దనతల్లి యుం
దమ్ములుఁ జేసిన యధర్మంబునకు నిర్వేదించి వారల విడిచి కడునిష్ఠతో
గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబు లాదిగాఁ గల
పుణ్యస్థానంబులం దనేక సహస్రవర్షంబులు బ్రహ్మ నుద్దేశించి తపంబు
సేసిన బ్రహయుఁ బ్రత్యక్షంబై వరంబు వేడు మనిన శేషుం డిట్లనియె.
(ఇలా పాములు అమృతం పొందలేక వెళ్లిపోగా, ఆదిశేషుడు తన తల్లి, తమ్ములు చేసిన పనికి బాధపడి, వారిని విడిచివెళ్లి, రకరకాల పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.)
No comments:
Post a Comment