వచనము
అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్ధసఖ్యుండైయుండె నిట వాసుకియుం దల్లి శాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడు సర్పకులప్రళయంబునకు వెఱచి తన బాంధవుల నైరావతాదిసహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యిట్లనియె.
(అని బ్రహ్మ నియోగించగా శేషుడు భూభారం వహించి గరుడుడికి స్నేహితుడయ్యాడు. ఇక్కడ వాసుకి అనే సర్పశ్రేష్ఠుడు తన తల్లి శాపం వల్ల జరగబోయే వినాశనానికి భయపడి తన బంధువులను, తమ్ములను పిలిచి దుఃఖంతో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment