వచనము
మఱి యమృతమథనంబునాఁడు మంథరమహానగంబునకు నేత్రంబ నయిన నా క్లేశంబునకు మెచ్చి యమరు లెల్లఁ బితామహుం బ్రార్థించి నాకు నవ్యయత్వంబును సకలభయవిమోక్షణంబునుం గా వరం బిప్పించి రైనను జననీశాపంబున నురగకులప్రళయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహం బైయుండు దాని నుడిగించు నుపాయం బెద్ది యేమి సేయువార మని చింతించుచున్న యన్నాగరాజునకు నాగకుమారు లత్యుద్ధతులై యిట్లనిరి.
(అమృతమథనం జరిగేటప్పుడు నేను కవ్వంగా ఉపయోగపడినందుకు మెచ్చి దేవతలు బ్రహ్మను వేడి నాకు అమరత్వం కలిగేలా వరం అనుగ్రహింపజేశారు. నాకు భయం లేకపోయినా, మన తల్లి శాపానికి సర్పాలకు జరగబోయే హాని వల్ల దుఃఖం కలుగుతోంది. అది ఆపేందుకు ఉపాయమేది అని చింతిస్తున్న వాసుకితో కొందరు నాగకుమారులు ఇలా అన్నారు.)
No comments:
Post a Comment