వచనము
మఱియు సకలలోకహితాచారంబులై ప్రసిద్ధులైన నాగముఖ్యుల నెల్ల వాసుకిచెలియ లైన జరత్కారువునకు జరత్కారుం డను మహామునికిం
బుట్టెడువాఁడధిక తేజస్వి యాస్తీకుండను మహాముని జనమేజయ సమారబ్ధసర్పసత్త్రప్రళయంబువలన రక్షించునని పితామహుండు దేవతలకుంజెప్పిన తెఱంగు సెప్పిన వాసుకిప్రముఖనాగముఖ్యు లెల్ల సంతసిల్లి యేలాపుత్త్రు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి వాసుకియు నాఁటంగోలె జరత్కారుమునీంద్రుం డెన్నండు దారపరిగ్రహంబు సేయునో యని తత్సమయసమాగమం బపేక్షించి యుండునంత.
(లోకాలకు మేలు కలిగించే నాగులను, వాసుకి చెల్లెలైన జరత్కారువుకూ, జరత్కారుడనే మునికీ జన్మించబోయే ఆస్తీకుడనే ముని ఆ సర్పయాగప్రళయం నుండి రక్షిస్తాడు, అని బ్రహ్మ దేవతలకు చెప్పిన విషయాన్ని ఏలాపుత్రుడు వివరించగా అతడిని అందరూ పొగిడారు. వాసుకి అప్పటినుండి జరత్కారుడు భార్యను పరిగ్రహించే సమయం కోసం ఎదురుచూడసాగాడు.)
No comments:
Post a Comment