సీసము
అభిమన్యునకు విరాటాత్మజ యైన యు
త్తరకును బుట్టిన ధర్మమూర్తి
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి
ప్రథఁ బరీక్షితుఁడు నాఁబరఁగువాఁడు
ధర్మార్థకామముల్ దప్పక సలుపుచుఁ
బూని భూప్రజ నెల్లఁ బుణ్యచరిత
ననఘుఁడై రక్షించి యఱువది యేఁడులు
రాజ్యంబు సేసిన రాజవృషభుఁ
ఆటవెలది
డధిక ధర్మమార్గుఁడైన నీయట్టి స
త్పుత్త్రుఁ బడసి యున్న పుణ్యుఁ డన్య
నాథమకుటమణిగణ ప్రభారంజిత
పాదపంకజుండు భరతనిభుఁడు.
(అభిమన్యుడికీ విరాటుని కూతురైన ఉత్తరకూ కౌరవవంశవినాశనం జరిగే సమయంలో పరీక్షితుడు జన్మించాడు. అతడు భరతుడంతటి గొప్పవాడు.)
No comments:
Post a Comment