వచనము
కని మునీంద్రా నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిట వచ్చె నది యెక్కడం బాఱె నీ వెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి తత్సమీపంబున నపగత ప్రాణంబై పడియున్న పాముం దనవింటికొప్పున నెత్తి యమ్మునియఱుతం దగులవైచి క్రమ్మఱి హస్తిపురంబునకు వచ్చియున్నంత.
(పరీక్షిత్తు అతడిని ఆ లేడి గురించి అడిగాడు. అతడు మౌనవ్రతం ధరించి ఉన్న కారణాన సమాధానం చెప్పకపోగా, పరీక్షిత్తు అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును ఆ ముని మెడలో తగిలించి హస్తినాపురానికి తిరిగివచ్చాడు.)
No comments:
Post a Comment