ఉత్పలమాల
సూరెల నున్న మంత్రులను జుట్టములం గడుఁగూర్చు మిత్త్రులన్
సారబలుండు చూచి మునిశాపదినంబులు వోవుదెంచె నం
భోరుహమిత్త్రుఁ డస్తగిరిఁ బొందెడు నం చొగిఁ దత్ఫలావలుల్
వారలకెల్లఁ బెట్టి యనవద్యుఁడు దా నొకపండు చెచ్చెరన్.
(పరీక్షిత్తు తన పక్కనే ఉన్న మంత్రులను, చుట్టాలను చూసి, "శృంగి శాపదినాలు గడిచాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు", అని, ఆ పండ్లను వారికందరికీ పెట్టి, తాను కూడా ఒక పండును.)
No comments:
Post a Comment