వచనము
పురందరుడును దొల్లి కమలజువాక్యంబున వాసుకిప్రముఖసర్పకులముఖ్యులకు సర్పసత్త్రభయంబు లేమి యెఱింగినవాఁడు గావున వాని నోడకుండుమని చేకొనియుండె నిట వాసుకియు జనమేజయసమారబ్ధసర్పసత్త్రపరిత్రస్తుండై ద్వియోజనత్రియోజనాయామస్థూలవ్యాళనివహంబులు నిజవంశ భ్రాతృవంశజనితంబు లయినవి జననీవాగ్దండపీడితంబు లయి యగ్నికుండంబునబడుటకు శోకించి తనచెలియలి జరత్కారువుం జూచి యిట్లనియె.
(బ్రహ్మ వరం వల్ల వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులకు సర్పయాగం చేత ప్రమాదం లేదన్న విషయం తెలిసిన ఇంద్రుడు తక్షకుడిని భయపడవద్దని చెప్పి ఆదరించాడు. ఇక్కడ వాసుకి సర్పయాగానికి భయపడి, నాగులు అగ్నిలో పడటం చూసి దుఃఖించి, తన చెల్లెలైన జరత్కారువుతో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment