కందము
తన గర్భాండంబుల రెం
టను బ్రియనందనులు వెలువడమి నతిలజ్జా
వనత యయి వినత పుత్త్రా
ర్థిని యొక యండంబు విగతధృతి నవియించెన్.
(తన గర్భంనుండి పుట్టిన అండాలు రెండింటినుంచీ పుత్రులు జన్మించకపోవటం వల్ల వినత సిగ్గుతో క్రుంగి, ధైర్యం కోల్పోయి, పుత్రుల కోసం ఒక గుడ్డును పగులగొట్టింది.)
No comments:
Post a Comment