ఉత్పలమాల
మేరుమహామహీధరముమీఁదికి నందఱుఁ బోయి యేక్రియన్
వారిధిఁ ద్రచ్చువారము ధ్రువంబుగ దానికిఁ గవ్వమెద్ది యా
ధారము దాని కెద్ది యని తద్దయు వెన్బడి యున్న నచ్యుతాం
భోరుహగర్భులిద్దఱును బూనిరి సర్వము నిర్వహింపఁగన్.
(మేరుపర్వతం మీదికి అందరూ వెళ్లి, "సముద్రాన్ని మథించటం ఎలా? అందుకు స్థిరమైన కవ్వమేది? ఆ కవ్వానికి తగిన ఆధారమేది?", అని చింతించి వెనుకాడుతుండగా బ్రహ్మవిష్ణువులు ఆ కార్యాన్నంతా నిర్వహించటానికి పూనుకున్నారు.)
No comments:
Post a Comment