సీసము
వాసవప్రతిముండు వసు వను నాతండు
చేదిభూనాథుండు శిష్టలోక
నుతకీర్తి మృగయావినోదార్థ మడవికిఁ
జని యొక్కమునిజనాశ్రమమునందు
నిర్వేదమున మహానిష్ఠతో సన్న్యస్త
శ్రస్త్రుఁడై తప మొప్పుఁ జలుపుచున్న
నాతనిపాలికి నమరగణంబుతో
నింద్రుండు వచ్చి తా నిట్టు లనియె.
ఆటవెలది
ధరణిఁ బ్రజఁ గరంబు దయతోడ వర్ణధ
ర్మాభిరక్షఁ జేసి యమలచరిత
నేలి రాజ్యవిభవ మది యేల యని తప
శ్చరణ నునికి నీక చనియె ననఘ.
(చేదిదేశానికి రాజైన వసువు ఒకరోజు వేటకు వెళ్లి అక్కడ ఒక మునుల ఆశ్రమాన్ని చూసి, నిర్వేదం చెంది, ఆయుధాలు వదిలి అక్కడే తపస్సు చేయనారంభించాడు. ఒకరోజు ఇంద్రుడు అతని దగ్గరకు వెళ్లి అతడిని మెచ్చుకొని.)
No comments:
Post a Comment