సీసము
పరశురాముండు భీకరనిజకోపాగ్ని
నుగ్రుఁడై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్త్రంబు సేసినఁ
దత్క్షత్త్రసతులు సంతానకాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల
దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల
నిప్పాటఁ దత్క్షత్ర మెసఁగి యుర్విఁ
ఆటవెలది
బర్వి రాజధర్మపద్ధతి ననఘ మై
జారచోర దుష్టజనుల బాధఁ
బొరయ కుండ నిఖిలభూప్రజాపాలనఁ
జేయుచుండె శిష్టసేవ్య మగుచు.
(పరశురాముడు ఇరవైయొక్కమార్లు దండెత్తి క్షత్రియులందరినీ వధించాడు. వారి భార్యలు సంతానకాంక్షతో, మహావిప్రుల దయతో సంతానాన్ని పొందారు. ఆ క్షత్రియవంశం పాపరహితంగా పరిపాలన సాగించింది.)
No comments:
Post a Comment