చంపకమాల
అతులబలాఢ్యు లైన యమరాంశసముద్భవు లెల్ల బాండుభూ
పతిసుతపక్ష మై సురవిపక్షగణాంశజు లెల్ల దుర్మదో
ద్ధతకురురాజపక్ష మయి ధారుణిభారము వాయ ఘోరభా
రతరణభూము నీల్గిరి పరస్పర యుద్ధము సేసి వీరులై.
(దేవతల అంశ గలవారు పాండవుల పక్షాన, రాక్షసుల అంశ గలవారు దుర్యోధనుడి పక్షాన భారతరణంలో పోరాడి మరణించి భూభారం తగ్గించారు.)
No comments:
Post a Comment