సీసము
యమునంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం
డనిలాంశమునఁ బుట్టె ననిలజుండు
శక్రాంశమున ధనంజయుఁ డుదయించె నా
శ్వినుల యంశముల నూర్జితులు నకుల
సహదేవు లనవద్యచరితులు పుట్టిరి
శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె
నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుఁ
డనఁ బుట్టె ద్రుపదరాజాన్వయమున
ఆటవెలది
ననఘ యిది సురాసురాంశావతారకీ
ర్తనము దీని వినినఁ దవిలి భక్తిఁ
జదివినను సమస్త జనులకు నఖిలదే
వాసురాదు లిత్తు రభిమతములు.
(యముడి అంశతో ధర్మజుడు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశతో నకులసహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి జన్మించారు. ఓ రాజా! ఇది దేవాసురుల అంశలతో పుట్టినవారి కీర్తనం, ఇది విన్నవారికి మంచి కలుగుతుంది.)
No comments:
Post a Comment