వచనము
ఇట్లు దేవయాని నుద్ధరించి నిజపురంబున కరిగె నిట దేవయానియు శర్మిష్ఠ సేసిన యెగ్గువలన విముక్త యయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణికయను పరిచారికం గని యేను వృషపర్వుపురంబు సొర నొల్ల శర్మిష్ఠచేత నాపడిన యవమానంబు మదీయజనకున కెఱింగింపు మని పంచిన నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతం బంతయు శుక్రునకుం జెప్పిన శుక్రుండును నాక్షణంబ వచ్చి కోపఘూర్ణితబాష్పపూరితనయనయై యున్న దేవయానిం గని యిట్లనియె.
(ఇలా దేవయానిని కాపాడి యయాతి వెళ్లిపోయాడు. దేవయాని తిరిగివస్తూ ఘూర్ణిక అనే పరిచారికను చూసి, "వృషపర్వుడి పురంలోకి నేను రాను. శర్మిష్ఠ చేసిన అవమానం నా తండ్రికి తెలియజెప్పు", అని చెప్పి పంపగా ఆమె ద్వారా శుక్రుడు విషయం తెలుసుకొని ఆ క్షణమే దేవయాని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment