వచనము
అది యె ట్లని యడిగిన శర్మిష్ఠ లజ్జావనతవదన యయి యి ట్లను నెందేనినుండి యొక్కమహాముని నిఖిలవేదవేదాంగపారగుండు వచ్చి ఋతుమతినై యున్న నన్నుం జూచి నాకుఁ బుత్రోత్పత్తిఁ బ్రసాదించె ననిన విని దేవయాని నిజనివాసంబునకుం జనియె శర్మిష్ఠయు నయ్యయాతి వలనఁ గ్రమంబున ద్రుహ్వ్యనుపూరు లనంగా మువ్వురు గొడుకులం బడసియున్నంత నొక్కనాఁడు.
(ఇది ఎలా జరిగింది అని అడగగా ఋతుమతి అయి ఉన్న తనను ఒక మహాముని అనుగ్రహించాడు అని శర్మిష్ఠ అన్నది. శర్మిష్ఠకు యయాతి వలన ద్రుహ్వుడు, అనువు, పూరుడు అనే కుమారులు కలిగారు.)
No comments:
Post a Comment