వచనము
అని తపోభిమానంబున మహర్షులతపంబు లవమానించి పలికిన నయ్యయాతి గర్వంబునకు సహింపక యింద్రుం డలిగి నీకు దేవలోకసుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తి యయ్యె నీగర్వంబు నిన్నింత సేసె నింక నధోలోకంబునకరుగుమనిన వాఁడును మనుష్యలోకంబునకుం బోవనోప నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకుఁబ్రసాదింపు మని యింద్రుననుమతంబు వడసి.
(అని గొప్ప మునుల తపస్సును తక్కువ చేసి మాట్లాడాడు. యయాతి గర్వాన్ని ఇంద్రుడు సహించక కోపగించి అతడిని అధోలోకాలకు వెళ్లమన్నాడు. అప్పుడు యయాతి, "నేను మానవలోకానికి వెళ్లలేను, ఆకాశంలో నక్షత్రాలతోపాటు ఉండేలా అనుగ్రహించ"మని ఇంద్రుడిని అనుమతి పొందాడు.)
No comments:
Post a Comment