వచనము
అది యెట్లనినం దొల్లి దాక్షాయణి యైన యదితికిఁ గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను మనువును యముండును శనైశ్చరుండును యమునయుఁ దపతియు ననం బుట్టి రందు వైవస్వతుం డను మనువువలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదులైన మానవులు పుట్టిరి మఱియు వానికి వేన ప్రముఖులైన రాజు లేఁబండ్రు పుట్టి వంశకరులై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి మఱియు నమ్మనుపుత్త్రియైన యిల యనుదానికి సోమపుత్త్రుండైన బుధునకుఁ బురూరవుఁడు పుట్టి చక్రవర్తియై.
(కశ్యపుడి కుమారుడైన వివస్వంతుడికి వైవస్వతమనువు పుట్టాడు. అతడి కుమారులు యాభైమంది తమలో తాము పోరాడి మరణించగా, అతడి కూతురైన ఇలకూ, చంద్రుడి పుత్రుడైన బుధుడికీ పురూరవుడు జన్మించాడు.)
No comments:
Post a Comment