వచనము
అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి శకుంతలామహాదేవి నతిప్రణయగౌరవంబున సంభావించి యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుం జేసి పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి తనరాజ్యభారం బంతయు భరతుం బూన్చి దుష్యంతుండు దపోవనంబున కరిగిన.
(అని దుష్యంతుడు శకుంతలను సన్మానించి, భరతుడిని యౌవరాజ్యపదవిలో అభిషేకించి, చాలాకాలం రాజ్యసుఖాలు అనుభవించి, రాజ్యభారాన్ని భరతుడికి అప్పగించి, తపోవనానికి వెళ్లిపోయాడు.)
No comments:
Post a Comment