వచనము
మర్త్యలోకంబున రాజర్షివరులలోనఁ బుణ్యచరిత్రుండు ప్రతీపుండు కావున వానికిఁ బుత్త్రుండనై జన్మించెద నొరులయందు జనింప నోపనని కమలభవుననుమతంబు వడసె గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందుల యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకమునకు వచ్చునది యెదుర.
(భూలోకంలోని రాజర్షులలో గొప్పవాడైన ప్రతీపుడికి మాత్రమే పుత్రుడిగా జన్మిస్తాను అని కోరి బ్రహ్మదేవుడి సమ్మతి పొందాడు. గంగకూడా మహాభిషుడిని ఇష్టపడి అతడి గురించే ఆలోచిస్తూ భూలోకానికి వచ్చింది. అప్పుడు ఎదురుగా.)
No comments:
Post a Comment