వచనము
ఏము వసిష్ఠమునివరుశాపంబునంజేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్క పుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపం బోయెద మని దుఃఖించి తమశాప ప్రకారంబు గంగాదేవికి నెఱింగించి యే మొండుచోట జన్మింపనోపము నీయంద పుట్టెదము మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁ గావున వానికి నీకును సమాగమం బగు మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు ననిన విని గంగ సంతసిల్లి యిట్లనియె.
(వారు వశిష్ఠుని శాపం గురించి గంగకు చెప్పి, "మేము నీకు పుత్రులమై జన్మిస్తాము. మహాభిషుడు ప్రతీపుడికి శంతనుడై జన్మిస్తాడు కాబట్టి మా జన్మకు అతడే కారకుడవుతాడు", అనగా ఆమె సంతోషించి.)
No comments:
Post a Comment