సీసము
సాంగంబు లగుచుండ సకలవేదంబులు
సదివె వసిష్ఠుతో సకలధర్మ
శాస్త్రాదిబహువిధశాస్త్రముల్ శుక్రబృ
హస్పతుల్ నేర్చినయట్ల నేర్చెఁ
బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత
దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె
నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమా
రాదుల యట్టిఁడ యనఘమూర్తి
ఆటవెలది
నొప్పు గొనుము వీని నుర్వీశ యని సుతు
నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్న పేదయ
పోలె సంతసిల్లి భూవిభుండు.
(ఇతడు వసిష్ఠుడి వద్ద వేదాలు చదివాడు. శుక్రుడు, బృహస్పతి నేర్చినట్లు వివిధశాస్త్రాలు నేర్చాడు. విలువిద్యలో పరశురాముడంతటి సమర్థుడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడంతటివాడు. నీ కుమారుడైన ఇతడిని స్వీకరించు - అని శంతనుడికి ఆ బాలుడిని అప్పగించి వెళ్లిపోయింది.)
No comments:
Post a Comment