వచనము
శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహం బై యతిమానుషం బయిన యాభీష్ముసత్యవ్రతంబునకు సంతసిల్లి యాతనికి స్వచ్ఛందమరణంబుగా వరం బిచ్చి సత్యవతియందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులన నిద్దరు గొడుకులం బడసి వారలు సంప్రాప్తయౌవనులు గాకుండఁ బరలోకగతుండైనఁ దండ్రికి భీష్ముండు పరలోకక్రియలు నిర్వర్తించి చిత్రాంగదు రాజ్యాభిషిక్తుం జేసిన నాతండును నతివ్యాలోలుం డై గర్వంబున నెవ్వరి నుఱక సుర దనుజ మనుజ గంధర్వాదులు నాక్షేపించుచున్న వాని కలిగి చిత్రాంగదుండను గంధర్వపతి యుద్ధార్థియయి వచ్చినం గురుక్షేత్రంబునందు.
(శంతనుడు సత్యవతిని వివాహమాడి భీష్ముడి సత్యనిష్ఠకు మెచ్చి అతడికి ఇష్టం వచ్చినప్పుడు మరణించే వరం ప్రసాదించాడు. తరువాత సత్యవతివల్ల చిత్రాంగద విచిత్రవీర్యులనే కుమారులను పొంది, వారు యువకులు కాకుండానే శంతనుడు మరణించాడు. భీష్ముడు తండ్రికి అపరక్రియలు చేసి చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు చంచలుడై అహంకారంతో ప్రవర్తిస్తుండగా చిత్రాంగదుడనే గంధర్వరాజు అతడిని ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు కురుక్షేత్రంలో.)
No comments:
Post a Comment