వచనము
అట్టి విచిత్రవీర్యు నారూఢయౌవనుం జూచి భీష్ముండు వివాహయత్నపరుం డయి తన చారులవలనం గాశీరాజు కూఁతుల స్వయంవరోత్సవంబు విని ధనుర్ధరుం డయి రథం బెక్కి యొక్కరుండును వారణాసీపురంబునకుం జనియందు స్వయంవరంబునకు మూఁగిన రాజలోకం బెల్ల వెఱచి వెఱఁగుపడిచూచుచుండ నక్కన్యకలఁ దన రథం బెక్కించికొని యెల్లవారలు విననిట్లనియె.
(యౌవనం పొందిన విచిత్రవీర్యుడికి వివాహం చేయటం కోసం, కాశీరాజు కుమార్తెల స్వయంవరం జరుగుతున్న వారణాసికి భీష్ముడు ఒక్కడే వెళ్లి, అక్కడి వారంతా నిశ్చేష్టులై చూస్తూండగా, ఆ కన్యలను తన రథంపై ఎక్కించుకొని అందరూ వినేలా ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment