వచనము
సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చిన యాప్రథమపుత్త్రు నతిహర్షంబునం గౌఁగిలించుకొని యవిరళపయోధారల నానందబాష్పధారలం జేసి యభిషేకించుచున్న నమ్మునివరుండును దల్లి బాష్పజలంబులు దుడిచి యభివాదనంబు సేసి పురోహితపురస్సరభూసురవరులతో విధిపూర్వకంబుగా భీష్ముండు సేసిన యర్ఘ్యాదిపూజలు సేకొని సుఖాసీనుం డై యున్న నమ్మహామునిఁ గుశలం బడిగి సత్యవతి యి ట్లనియె.
(సత్యవతి సంతోషించి, చాలాకాలం తరువాత వచ్చిన అతడి క్షేమం అడిగి ఇలా అన్నది.)
No comments:
Post a Comment