వచనము
అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబికకడకుం జని క్షేత్రజుం డైనవాఁడు సుపుత్త్రుండు గావున ధర్మ్యం బైన విధానంబున నీవు రాజ్యధురంధరుం డయిన కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు మెల్లధర్మంబులకంటెఁ గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు నేఁటిరాత్రి నీకడకు దేవరుండు వచ్చుం దదాగమనంబుఁ బ్రతీక్షించి యుండునది యని కోడలి నొడంబఱిచి యనేకసహస్రమహీసురులను దేవతలను ఋషులను నిష్టభోజనంబులం దనిపియున్న నారాత్రియందు.
(అని సత్యవతి వ్యాసుడిని ఆజ్ఞాపించి, అంబిక దగ్గరకు వెళ్లి ఆమెను అంగీకరింపజేసింది. ఆ రాత్రి.)
No comments:
Post a Comment