సీసము
యాదవకులవిభుఁ డగు శూరుఁ డను నాతఁ
డాత్మతనూజలయందుఁ బెద్ద
దాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు
చెలియలిఁ బృథ యను చెలువఁ బ్రీతిఁ
దనమేనయత్తనందనుఁ డపుత్త్రకుఁ డైన
యా కుంతిభోజున కర్థితోడఁ
గూఁతుఁగా నిచ్చినఁ గోమలి యాతని
యింటఁ దానుండి యనేక విప్ర
తేటగీతి
వరుల కతిథిజనులకు నవారితముగఁ
దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరఁ
జేయుచున్న దుర్వాసుఁ డన్ సిద్ధమౌని
వచ్చె నతిథి యై భోజనవాంఛఁ జేసి.
(యాదవరాజైన శూరుడు అనేవాడు తన పెద్దకుమార్తె పృథను పిల్లలు లేని తన మేనత్త కొడుకు కుంతిభోజుడికి కుమార్తెగా ఇచ్చాడు. ఆమె కుంతిభోజుడి ఇంట్లో ఉండగా దుర్వాసుడు ఒకరోజు అతిథిగా వచ్చాడు.)
No comments:
Post a Comment