తేటగీతి
పఱవనోపక యున్న మైమఱచి పెంటిఁ
బెనఁగియున్నను బ్రసవింప మెనసియున్నఁ
దెవులు గొనియున్న మృగములఁ దివిరి యేయ
రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన.
(కానీ, పరుగెత్తలేనివి, పెంటితో కూడి ఉన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో ఉన్నవి అయిన జంతువులను మాంసమే ఆహారంగా జీవించే బోయవారు కూడా కొట్టరు.)
No comments:
Post a Comment