వచనము
మఱియుం గల వస్తువు లెల్లను ధృతరాష్ట్రున కిచ్చి పుచ్చి మమత్వాహంకారవిముక్తుండై ధర్మపత్ను లయ్యిరువురుఁ దనయట్ల తపస్విను లై తోడరా నుత్తరాభిముఖుం డై యరిగి నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును హిమవంతంబునుం గడచి సురసిద్ధసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి యింద్రద్యుమ్నం బను కొలనును హంసకూటంబును నతిక్రమించి.
(తన దగ్గర మిగిలిన వస్తువులన్నీ ధృతరాష్ట్రుడికి పంపి, తన భార్యలు వెంటరాగా, ఉత్తరదిశలో బయలుదేరాడు.)
No comments:
Post a Comment