వచనము
ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి భీష్ముండు గాంధారపతి యయిన సుబలుకూఁతు గాంధారి యనుదాని నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె.
(ధృతరాష్ట్రుడికి వివాహం చేయటానికి భీష్ముడు పూనుకొని, గాంధారరాజు సుబలుని కుమార్తె గాంధారి యోగ్యురాలని విని, విదురునితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment