వచనము
ఔరస క్షేత్త్రజ దత్తక కృత్రిమ గూఢోత్పన్నాపవిద్ధు లను నార్వురు పుత్త్రులు బంధువులు దాయాదులు నగుదురు కానీన సహోఢక్రీతపౌనర్భవ స్వయందత్త జ్ఞాతులను నార్వురు పుత్త్రులు బంధువు లగుదురు గాని దాయాదులు గా రట్టి పుత్త్రులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్త్రులకంటె క్షేత్రజుం డుత్కృష్టుం డందును దేవరన్యాయజాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్త్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తు నె ట్లనినఁ దొల్లి గేకయరా జైన శారదండాయని పుత్త్రోత్పాదనంబునం దశక్తుం డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్త్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాత యై పుంసవనహోమంబు సేయించి ఋత్విజులవలన దుర్జయాదు లయిన కొడుకుల మువ్వురం బడసెఁ బుత్త్రలాభంబున ననంతపుణ్యఫలం బగుట నది ధర్మ్యం బయిన యాచారం బనిన విని కుంతి యి ట్లనియె.
(దేవరన్యాయం చేత క్షేత్రజులను పొందటం ధర్మమే - అని పాండురాజు చెప్పగా కుంతి ఇలా అన్నది.)
No comments:
Post a Comment