వచనము
కావున నిప్పుడ దుర్యోధను దూషింతము నీకు వెండియుఁ బుత్త్రశతంబు సంపూర్ణం బయి పెరుఁగుచున్నయది యనిన ధృతరాష్ట్రుండు పుత్త్రమోహంబున నప్పలుకులు విననొల్లకుండె నంత నట శతశృంగంబునఁ గుంతీదేవి భీమసేను సుపుత్త్రుం బడసి దశమదివసంబున వేల్పులకు మ్రొక్కఁ గొడుకు నెత్తికొని దేవగృహంబునకుఁ బోవునెడ నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్థి యయి పయికి లంఘించిన.
(నీకు ఇంకా వందమంది పిల్లలు ఉన్నారు - అనగా ధృతరాష్ట్రుడు ఆ మాటలు వినలేదు. అక్కడ శతశృంగం మీద కుంతి, భీముడిని కన్న పదోరోజున, దేవాలయానికి పోతూ ఉండగా ఒక పులి వారి మీదికి దూకింది.)
No comments:
Post a Comment