సీసము
మృగ శాప భయమున జగతీశుఁ డప్పాండు
పతి శతశృంగపర్వతమునందుఁ
బత్నీసమేతుఁడై యత్నంబుతో ఘోర
తప మొనరించుచు విపులశక్తి
నమరవరప్రసాదమున ధర్మస్థితిఁ
గొడుకుల నేవురఁ బడసె ననియు
విని వసుదేవుండు మనమున హర్షించి
యనుజను మఱఁదిని ఘనుఁడు చూడఁ
తేటగీతి
దనపురోహితుఁ గశ్యపుం డను మహాత్ముఁ
జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి
నేయు లగు కుమారులకు నమేయరత్న
భూషణావళు లిచ్చి విశేషలీల.
(కుంతి అన్న అయిన వసుదేవుడు పాండవులు పుట్టిన విషయం విని, తన పురోహితుడు కశ్యపుడితో, వారికి కానుకలు పంపాడు.)
No comments:
Post a Comment