వచనము
మఱియు మృగశాపభయం బెఱింగియు ని ట్లేమఱిన యతిప్రమత్తురాల నే నిందుండి పుత్త్రుల రక్షింప నేర నన్ను వారింప వలవదు కొడుకుల నేమఱక రక్షించునది యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు మ్రొక్కి మద్రరాజపుత్త్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె నంత నయ్యిరువుర యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్చి.
(శాపం విషయం తెలిసి కూడా జాగ్రత్త లేని నేను ఇక్కడ ఉండి మన కొడుకులను కాపాడలేను. నన్ను అడ్డుకోవద్దు - అని చెప్పి సహగమనం చేసింది. తరువాత మునులు కుంతినీ, ఆమె కొడుకులనూ ఓదార్చి.)
No comments:
Post a Comment