Tuesday, April 11, 2006

1_5_161 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుండని చెప్పి చనిన సత్యవతియుఁ బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెఱింగించి కోడండ్ర నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి రిట ధృతరాష్ట్రుండును.

(దానిని ధృతరాష్ట్రుడే అనుభవిస్తాడు. మీరు తపోవనానికి వెళ్లండి - అని చెప్పి వెళ్లగా సత్యవతి అలాగే అంబిక, అంబాలికలతో అడవికి వెళ్లింది. వారు తపస్సు చేసి కొంతకాలానికి స్వర్గం చేరారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు.)

No comments:

Post a Comment