సీసము
అమ్ముని యొక్కనాఁ డభిషేచనార్థంబు
గంగకుఁ జని మున్న కరము లీల
నందు జలక్రీడ లాడుచునున్న య
ప్సరస ఘృతాచి యన్సదమలాంగి
పటుపవనాపేత పరిధాన యైన య
య్యవసరంబునఁ జూచి యమ్మృగాక్షిఁ
గామించి యున్నఁ దత్కామరాగంబున
యతిరేకమునఁ జేసి యాక్షణంబ
తేటగీతి
తనకు శుక్లపాతం బైన దానిఁ దెచ్చి
ద్రోణమున సంగ్రహించిన ద్రోణుఁ డనఁగఁ
బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి
ధర్మతత్త్వజ్ఞుఁ డగు భరద్వాజమునికి.
(ఘృతాచి అనే అప్సరసను చూసి కామించాడు. వారికి ద్రోణుడు పుట్టాడు.)
No comments:
Post a Comment