వచనము
మఱి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునం జేసి మిత్త్రామిత్త్ర సంబంధంబులు సంభవించుం గావున మా యట్టి రాజులకు మీయట్టి పేదపాఱువారలతోఁ గార్యకారణంబైన సఖ్యం బెన్నండును గానేర దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని ద్రోణుం డవమానజనిత మన్యుఘూర్ణమాన మానసుం డయి యెద్దియుం జేయునది నేరక పుత్త్ర కళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె నంత నప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందఱుఁ గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడిన.
(అని అవమానించగా, ద్రోణుడు కోపం కలిగినా ఏమీ చేయలేక, హస్తినాపురానికి వచ్చాడు. అప్పడు ఆ పట్టణం బయట కౌరవులు, పాండవులు చెండాట ఆడుకుంటూ ఉండగా వాళ్లు ఆడుకుంటున్న బంతి బావిలో పడింది.)
No comments:
Post a Comment