వచనము
ఏను ద్రోణుం డను వాఁడ భరద్వాజపుత్త్రుండ నగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననాఁడు పాంచాలపతి యైన పృషతుపుత్త్రుండు ద్రుపదుం డను వాఁడు నా కిష్టసఖుం డయి యెల్లవిద్యలు గఱచి యేను పాంచాల విషయంబునకు రాజయిననాఁడు నా యొద్దకు వచ్చునది నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండ వని నన్నుఁ బ్రార్థించి చని పృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయి యున్న నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధికతేజస్వి నాత్మజుం బడసి ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్థుండ నయి యుండియు.
(ద్రోణుడు తన వృత్తాంతం చెప్పాడు.)
No comments:
Post a Comment