వచనము
ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతి స్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న నానాదేశంబులం గల రాజపుత్త్రు లెల్ల వచ్చి వారితోడఁ గలసి కఱచుచుండిరి మఱియు సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె నంత.
(ద్రోణుడు సంతోషించి వారికి విలువిద్య నేర్పుతుండగా సూతుడి కుమారుడైన రాధేయుడు అర్జునుడి మీద ద్వేషంతో దుర్యోధనుడి పక్షంలో వచ్చి చేరాడు.)
No comments:
Post a Comment